_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు
మనవార్తలు ,పటాన్ చెరు;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల సైతం గురికావాల్సింది వస్తుందని వాపోయారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సువీశాల విస్తీర్ణంలో, ఆధునిక వసతులతో కోర్టు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అడ్వకేట్లు ప్రభుదన్యం, రమేష్, శ్రీనివాస్, రవికుమార్, నాగరాజు, రమాదేవి, రవి, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…