పటాన్చెరు:
శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణుడి రథయాత్ర నిర్వహించారు. స్థానిక కోదండ సీతారామస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా సాగింది.
భక్తుల జయజయ ధ్వానాల నడుమ, హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కీర్తనలు ఆలపిస్తూ యాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా పలు కూడళ్లలో ఉట్టిలు కొట్టడం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఉట్టి కొట్టి అందరిని ఉత్సాహ పరిచారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడిని కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి , విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, ఎట్టయ్య, గోపాల్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, రాజు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…