Telangana

క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం_ పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు

ఆలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరుతుందని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పేర్కొన్నారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో గురువారం స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథితులు గా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాటను నిజం చేసేది క్రీడలేనని,క్రీడల ద్వారా మనం క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు మరియు క్రీడాస్ఫూర్తిని నేర్చుకుంటాము. గెలుపు ఓటములు కేవలం ఫలితాలు మాత్రమేనని కానీ క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే అసలైన విజయమన్నారు.

ఓటమి మనకు అనుభవాన్ని నేర్పితే, విజయం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందన్నారు. క్రీడా పోటీలలో పాల్గొనే ప్రతి విద్యార్థి, విద్యార్ధినులందరు నిజమైన విజేతలే అన్నారు. విద్యతో పాటుగా క్రీడలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే విద్యార్థులు గొప్ప ప్రపంచ స్థాయి క్రీడాకారులు అవుతారని చెప్పారు. ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కారం అనేది ఇంటి నుంచే ప్రారంభమావ్వాలని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టి సంస్కారం నేర్పడంతో పాటు వాళ్ళ పిల్లల పైన రోజు కొంత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయాయి.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర రావు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరస్పెండెంట్ జోసెఫ్ బాబు,సెల్వన్ ఫాదర్, ఇష్టా విద్యాసంస్థల పటేల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ రజిత, బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ తులసి, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ,మిల్క్ రాజు, సన్నీ యాదవ్, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago