Telangana

ఆధునిక వాస్తవిక కల్పన నవల

గీతం కీలకోపన్యాసంలో పేర్కొన్న

జేఎన్ యూ ఆచార్యుడు ప్రొఫెసర్ ఉదయ కుమార్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

భారతీయ నవల, సామాజిక వాస్తవికత, సామూహిక అనుభవంతో వేళ్లూనుకుందని, ముఖ్యంగా ఆధునిక వాస్తవిక కల్పనగా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రొఫెసర్ ఉదయ కుమార్ అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘పరివర్తన దశ: భారతదేశంలో సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల చర్చాగోష్ఠిలో శుక్రవారం ఆయన కీలకోపన్యాసం చేశారు.సాహిత్యం అనే భావనను ఒక పరిమిత అభ్యాసంగా పేర్కొంటూ, ఇది స్థిర నిర్వచనాలను నిరోధించి, ఉన్నత వర్గాల మధ్య ఉంటుందని అన్నారు. సాహిత్యం గత శతాబ్దంన్నర కాలంలో పరిణామం చెందుతూ, ప్రజాక్షేత్ర విశ్వాసంపై ఆధారపడి, అనామక పాఠకులను ఉద్దేశించిందని చెప్పారు. భౌతిక, సామాజిక, సౌందర్యేతర పరిస్థితుల ద్వారా రూపొందించిన ఆధునిక నిర్మాణంగా ఇది ఉద్భవించిందన్నారు. సాహిత్యం యొక్క ఈ అవగాహన సమకాలీన కాలంలో గణనీయమైన పరివర్తనకు గురవుతోందని స్పష్టీకరించారు.

మలయాళ సాహిత్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, ముఖ్యంగా సి.అయ్యప్పన్, దళిత రచయిత రచనలను ఆయన ప్రస్తావించారు. ‘పగటిపూట’, ‘రాత్రిపూట’ కథనాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఈ రచనలు కేరళలో, ముఖ్యంగా కుట్టనాడ్ వంటి ప్రాంతాలలో కుల అణచివేత, సౌందర్య బానిసత్వం, సామాజిక బాధల చరిత్రలను ఎలా ప్రేరేపిస్తాయో ప్రొఫెసర్ కుమార్ వివరించారు. ఈ కథనాలు సమూహం యొక్క పరిశుభ్రమైన, లేదా జాతిపరమైన ప్రాతినిధ్యాలను ఎలా ప్రతిఘటిస్తాయో, సమ్మిళితత్వం, సామాజిక ఊహ యొక్క ఆధిపత్య భావనలను సవాలు చేసే సంక్లిష్టమైన, మూర్తీభవించిన సామాజిక అనుభవాలను ఎలా ఎలుగెత్తి చాటుతాయో విశ్లేషించారు.తొలుత, డాక్టర్ జోమీ అబ్రహం, అతిథిని పరిచయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ వివరణతో ముగిసింది. జీఎస్ హెచ్ఎస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ ధరు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రశ్నించి, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago