Telangana

గీతం అధ్యాపకురాలు ఝాన్సీ రాణికి సీఎస్ఈలో డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

‘ట్వీట్ల సెంటిమెంట్ ను విశ్లేషించడం కోసం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ల అభివృద్ధి’పై పరిశోధన చేసి, దానిపై a సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఝాన్సీ రాణి తిరుమలశెట్టిని డాక్టరేట్ వరించింది. హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఈ పట్టాను అందుకున్నారు. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ కె. అనూరాధ మార్గదర్శనంలో ఈ పరిశోధనను చేపట్టినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ట్వీట్ల పరిమాణంలో విపరీతమైన పెరుగుదలను ఎదుర్కోవడానికి మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి, మానసిక భావనల (సెంటిమెంట్) విశ్లేషణ ఆవశ్యకతపై ఆమె దృష్టి సారించిందన్నారు. సామాజిక వెబ్ డేటా, పరిశోధన సెంటిమెంట్ విశ్లేషణలో అధిక పరిమాణం సమస్యను కూడా పరిష్కరించినట్టు తెలిపారు. దీని ఫలితంగా తక్కువ అంచనా ఖచ్చితత్వం, తప్పుడు హెచ్చరికలు అధిక సంఖ్యలో ఏర్పడ్డాయన్నారు. ఝాన్సీ రాణి సమర్పించిన సిద్ధాంత వ్యాసం జెఎన్టీయూ హైదరాబాద్ నుంచి పీహెచ్ డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ మహబూబ్ బాషా షేక్, పలు విభాగాల అధిపతులు, అధ్యాసకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago