పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సునీత ప్రత్తిపాటి గణిత క్వాంటమ్ భౌతిక శాస్త్రాల సంయుక్త పరిశోధనతో డాక్టరేట్ అర్హత సాధించారు. ‘సమరూప్యతానుకూల లీ బీజగణితం ఉపయోగించి సూక్ష్మ, మధ్యస్థ అణువుల ప్రకంపన పౌనఃపున్యాల గణింపు అధ్యయనంపై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనలను సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న గణిత శాస్త్ర విభాగం సహ ఆచార్యుడు డాక్టర్ విజయశేఖర్. జాలిపర్తి, భౌతికశాస్త్ర విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ ముల్లేశ్వరరావు బళ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రఖ్యాత జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం, కొలకత్తా లోని గణిత శాస్త్ర విభాగం ఆచార్యుడు. ప్రొఫెసర్ ఫరూక్ రెహ్మాన్ దీనికి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు. సునీత ప్రత్తిపాటి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీపీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…