politics

సరళీకృత విధానాల వల్ల దేశానికి పెను ముప్పు

– ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– ఇంటీ జాగా ఉన్న వారికీ ప్రభుత్వం 5లక్షలు ఇవ్వాలి

_సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

మనవార్తలు , పటాన్ చెరు:

మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న సరళీకృత విధానాల వల్ల దేశానికి పెను ముప్పుగా పరిణమించాయని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజు మండిపడ్డారు.శుక్రవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సిపిఎం పటాన్ చెరు నియోజకవర్గం స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభం కు జయరాజ్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మిన ఘనకీర్తి మోడీకే దక్కిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే దేశ సంపద, ప్రజల సొత్తన్నారు వాటిని స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీలకు అమ్మేస్తున్నాడని అంబానీ, ఆదాని వంటి బడాబాబులు తప్ప ఈ దేశంలో ఉన్న కోట్లను కోట్ల మంది ప్రజలు మోడీకి కనిపించడం లేదని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు ఊడిగం చేసే లేబర్ కోర్డ్ లను తీసుకొచ్చిండని అన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే ఘోరంగా దేశాన్ని దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు కష్టాలు దోపిడీదారులకు సుఖాలు ఇది మోడీ పాలన అని అన్నారు. ప్రజా ఉద్యమాలతో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తయిందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇంటీ జాగా ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాడ్ చేశారు.

కమ్యూనిస్టుల తోనే ప్రజలకు మేలు అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని ప్రజా ఉద్యమాలతో గుణపాఠం తప్పదనిప్రజా సమస్యలపై సమరశీల పోరాటాల కు కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి జయరాజ్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాయిని నరసింహారెడ్డి, పటాన్ చెరు సిపిఎం నాయకులు పాండు రంగారెడ్డి,నాగేశ్వరరావు,యన్ శ్రీనివాస్, సత్తిబాబు, వెంకట్ రామ్ రెడ్డి, ప్రసాద్, జార్జ్,విష్ణు,మని రాజు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago