Telangana

వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అయోధ్య భవ్య రామ మందిరంలో శ్రీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకొని పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు స్వామి వారి యొక్క ప్రసాదాలను అందించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ చారి మాట్లాడుతూ 500 సంవత్సరాల కళ నెరవేరిందని అయోధ్యలో భవ్య రామ మందిరంలో శ్రీ బాల రాముల విగ్రహ పణ ప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా చేయడం చాలా ఆనందంగా ఉంది అని భారతదేశము భిన్నత్వంలో ఏకత్వమని కులమత్ యాత్రలకు అతీతంగా ఈ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారని అన్నారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో ఇంద్రేశం సిటిజన్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ శ్రీరాముని పూజా కార్యక్రమానికి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరము కలిసి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సాయంకాలము పెద్ద ఎత్తున స్వామి వారి శోభాయాత్ర నిర్వహించడం శోభాయాత్రలో చాలామంది యువకులు పాల్గొని తమ యొక్క భక్తిని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి వేణుగోపాలు, ఉపాధ్యక్షులు భూపిన్ కుమార్, కార్యదర్శి సందీప్ కుమార్, నిర్వహణ కార్యదర్శి సునీల్ చారి, సలహాదారులు బద్రి, విశాల్, రాజు, మల్లేశం, సభ్యులు చండీశ్వర్, శ్రావణ్ చారి, నరేష్, సురేష్, ఆకాష్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago