Hyderabad

షీ టీమ్ లు దేశానికే ఆదర్శం – గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా

పటాన్‌చెరు:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్ లు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని ఐపీఎస్ అధికారిణి, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు విస్తరణ డెరైక్టర్ నిధి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పౌర సమాజం స్వచ్ఛందంగా ముందుకొస్తే కలిసి పనిచేయడానికి తాము సదా సిద్ధమేనని చెప్పారు. ఏదైనా అమర్యాదకర ఘటన జరిగిన వెంటనే మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మహిళల భద్రత కోసం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులతో కేసీఆర్ ఒక కమిటీని వేశారని, 82 సిఫారసులలో భాగంగా ఏర్పాటయిన షీ టీమ్స్ నాయకత్వాన్ని తనకు అప్పగించినట్టు స్వాతి లక్రా చెప్పారు. ఉన్నతాధికారుల సహకారంతో చేపట్టిన ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్నానని, బాధిత మహిళ పోలీసు స్టేషన్ కు వచ్చే అవసరం లేకుండా వాట్సాప్, క్యూఆర్ కోడ్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీనికి ఐసీసీ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తోడయిందన్నారు. ఫిర్యాదు నేపథ్యం, తగిన ఆధారాలు, సాంకేతిక సహకారంతో నమోదైన కేసులను త్వరగా పరిష్కరిస్తున్నా మని చెప్పారు.

ఇప్పటి వరకు దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయని, చాలావరకు పెట్టీ (చిన్న) కేసులేనని, తప్పులు పునరావృతం చేసే వారి సంఖ్య చాలా స్వల్వమేనని ఆమె స్పష్టీకరించారు. పలు నేరాలలో మైనర్లు నిందితులడం తమను కలచివేసిందని, తల్లిదండ్రుల సమక్షంలో వారిని కౌన్సెలింగ్ చేయడం మంచి ఫలితాలను ఇస్తోందని, నేరాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడమే అందుకు నిదర్శనమని స్వాతి లక్రా వివరించారు. తమ గబృందాలు పలు కళాశాలలను సందర్శించి చేపట్టిన చైతన్య కార్యక్రమాలు కూడా ఫలవంతమయ్యాయన్నారు.

మహిళలపై నమోదయ్యే కేసులలో గృహహింస కేసులే ఎక్కువని, తమకు ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే వాలంటీర్ల సాయంతో కౌన్సెలింగ్ నిర్వహించి, పూర్వాపరాలు పరిశీలించి వాటిని నివారించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రాంచీలో జన్మించిన తన బాల్యం, చదువు, కుటుంబం, తల్లిదండ్రులు, వృత్తిని చేపట్టడం వంటి పలు అంశాల గురించి స్వాతి వివరించారు. తండ్రి కోరిక మేరకు తాను పోలీసు వృత్తిలోకి అడుగిడినా, ఆ వృత్తిని ప్రేమించడం ద్వారా రాణించినట్టు చెప్పారు. ఏ వృత్తిలోనైనా సవాళ్ళు సహజమేనని, వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోనాలన్నారు. పలు సందేహాలకు సందర్భోచిత జనాబులిచ్చి అకట్టుకున్నారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, ఐపీఎస్ అధికారి స్వాతిని సత్కరించారు.

ఇక చదవండి

వజ్రాభరణాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టం కామిక్షి భాస్కర్ల

పవన్ కల్యాణ్… నువ్వు అడిగిన ప్రతి మాటకు అక్టోబరు 10 తర్వాత సమాధానం చెబుతా: మోహన్ బాబు!

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

6 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago