Telangana

శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీనీ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప మహిళా కార్యాలయం లో శేరిలింగంపల్లి బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసి నూతన కమిటీని నియమించారు. ముఖ్యాతిధిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ముఖ్య నాయకులు నర్సింలు ముదిరాజ్ లు పాల్గొని మహిళ కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు.

శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షురాలుగా ఆర్. అనిత, ఉపాధ్యక్షురాలు ఎం.. సునంద, మరియు కే. రాజమణి, సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగమణి. కోశాధికారిగా ప్రతిమ లను నియమించగా వారు నియామక పత్రాలను స్వీకరించారు. మన సమస్యలతో పాటు కాలనీ సమస్యలను పరిష్కరించుకొనుటకు మీరందరూ సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుటకు మేమందరం మీ వెంట ఉన్నామని, మీరందరూ మా వెంట ఉండి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందామని సంఘం సభ్యులు తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో 17 శాతం మాత్రమే లబ్ది పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారనీ, మనకు 42 శాతం ఉండాలి కాబట్టి 42 శాతం ప్రత్యక్షంగా బీసీలు లబ్ధి పొందే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం స్థానిక ఎన్నికల్లోను సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పిటిసి కార్పొరేటర్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ లు కూడా 42 శాతం రిజర్వేషన్ చేసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు పురుషులతో సమానం కాబట్టి అందరూ పోరాడండి పోరాడుతే ఈ ప్రజాస్వామ్యంలో మనకు న్యాయం జరుగుతుందనీ, సామాజిక న్యాయం మరియు రాజకీయ న్యాయం జరిగే వరకూ పోరాడుదామని పిలుపునిచ్చారు. తమ ఫై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వంతు కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసి, బీసీల ఐక్యత కు పాటుపడతామనీ అధ్యక్షురాలు అనిత మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం లో బి గంగ, ఆర్. లతటీ. అంకమ్మ, జ్యోతి, ఎం పద్మ, పద్మాదేవి,జి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago