Telangana

శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీనీ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప మహిళా కార్యాలయం లో శేరిలింగంపల్లి బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసి నూతన కమిటీని నియమించారు. ముఖ్యాతిధిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ముఖ్య నాయకులు నర్సింలు ముదిరాజ్ లు పాల్గొని మహిళ కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు.

శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షురాలుగా ఆర్. అనిత, ఉపాధ్యక్షురాలు ఎం.. సునంద, మరియు కే. రాజమణి, సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగమణి. కోశాధికారిగా ప్రతిమ లను నియమించగా వారు నియామక పత్రాలను స్వీకరించారు. మన సమస్యలతో పాటు కాలనీ సమస్యలను పరిష్కరించుకొనుటకు మీరందరూ సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుటకు మేమందరం మీ వెంట ఉన్నామని, మీరందరూ మా వెంట ఉండి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందామని సంఘం సభ్యులు తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో 17 శాతం మాత్రమే లబ్ది పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారనీ, మనకు 42 శాతం ఉండాలి కాబట్టి 42 శాతం ప్రత్యక్షంగా బీసీలు లబ్ధి పొందే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం స్థానిక ఎన్నికల్లోను సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పిటిసి కార్పొరేటర్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ లు కూడా 42 శాతం రిజర్వేషన్ చేసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు పురుషులతో సమానం కాబట్టి అందరూ పోరాడండి పోరాడుతే ఈ ప్రజాస్వామ్యంలో మనకు న్యాయం జరుగుతుందనీ, సామాజిక న్యాయం మరియు రాజకీయ న్యాయం జరిగే వరకూ పోరాడుదామని పిలుపునిచ్చారు. తమ ఫై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వంతు కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసి, బీసీల ఐక్యత కు పాటుపడతామనీ అధ్యక్షురాలు అనిత మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం లో బి గంగ, ఆర్. లతటీ. అంకమ్మ, జ్యోతి, ఎం పద్మ, పద్మాదేవి,జి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

21 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

22 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago