Telangana

గీతం అధ్యాపకుడికి సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు…

మనవార్తలు ,పటాన్ చెరు:

హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లేశం బెల్జికి భారత శాస్త్ర , సాంకేతిక పరిశోధన మండలి ( సెర్చ్ ) పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసింది . ఈ విషయాన్ని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ‘ లిగ్నో సెల్యులోజ్నీ లిగ్నిన్- ఉత్పన్న రసాయనాలుగా మార్చడానికి నూతన , సమర్థ ఉత్ప్రేరక వ్యూహాలను రూపొందించడానికి ‘ చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సెర్చ్ తగిన పాలనా అనుమతులతో పాటు రూ .33 లక్షల గ్రాంటును మంజూరు చేసిందని , రెండేళ్ళ వ్యవధిలో దీనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు . ఈ పరిశోధనలో సాయపడేందుకు గాను ప్రాజెక్టు ఫెలో ( జేఆర్ఎఫ్ ) అవసరం ఉందని , ఎమ్మెస్సీ కెమిస్ట్రీ / అప్లయిడ్ కెమిస్ట్రీ / మెటీరియల్ సెన్స్లు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు అర్హులని , సీఐఎస్ఆర్ – యూఐసీ – నెట్ / గేట్ / డీబీటీ / ఐసీఎంఆర్ అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు . ఇతర వివరాల కోసం 9966 9988 52 ను సంప్రదించాలి లేదా mbaithy@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని సూచించారు . సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు పొందిన డాక్టర్ మల్లేశంను గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం , హెదరాబాద్ ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు ఎంఎస్ , పలువురు అధ్యాపకులు , యూజీసీ వ్యవహారాల సమన్వయకర్త తదితరులు అభినందించి , గడువులోగా పరిశోధనను పూర్తిచేయమని సలహా ఇచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

గీతమ్లో ఘనంగా గాంధీ జయంతి జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ విశిష్ట అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఏ రామారావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ , హార్టికల్చర్ అధికారి శరత్ బాబు తదితరులు గాంధీ స్క్వేర్లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago