Districts

సెన్ట్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది… – గీతం జాతీయ సెన్ట్స్ ఐఏఈఏ పూర్వ నిపుణుడు డాక్టర్ రామ్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు:

శాస్త్రం ( సెన్స్డ్ ) సమాజంతో ముడిపడి ఉందని , అది సమాజాన్ని ప్రభావితం చేస్తుందని , అదే సమయంలో సమాజం వల్ల ప్రభావితమవుతుందని భాభా అణు పరిశోధనా సంస్థ పూర్వ డెరైక్టర్ , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిపుణుడు డాక్టర్ కె.ఎల్.రామకుమార్ అన్నారు . సర్ సీవీ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ను గుర్తుంచుకోవడానికి , మన జాతి , విశ్వాభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతియేటా నిర్వహించే జాతీయ సెన్స్ దినోత్సవాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముందస్తుగా రికార్డు చేసిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , కొత్త శాస్త్రీయ జ్ఞానం నూతన ఆవిష్కరణకు దారితీయొచ్చని , డీఎన్ఏ నిర్మాణం ఆవిష్కరణ జీవశాస్త్రంలో ఒక ప్రాథమిక పురోగతి అని చెప్పారు . ఇది డీఎన్ఏ వేలిముద్రలు , జన్యుపరంగా మార్పిడి చేసిన పంటలు , జన్యు వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో సహా అనేక రకాల ఆచరణాత్మక విధానాలకు దారితీసినట్టు వివరించారు .

నిర్మాణాత్మక యోచన శాస్త్రీయ పరిశోధనలను ప్రేరేపించవచ్చని , మలేరియా వంటి వ్యాధులకు మందులను చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఈ రంగంలోని అనేకమంది పరిశోధకులను సూక్ష్మజీవుల జన్యుశాస్త్రంపై అధ్యయనాలను కొనసాగించడానికి ప్రేరేపిస్తోందన్నారు . శాస్త్రం లేకపోతే సమాజం పురోగమించదని , సమాజానికి ఉపకరించే విధంగా శాస్త్రం తోడ్పడాలని గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ సూచించారు . తొలుత విద్యార్థులందరికీ జాతీయ సెన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . జాతీయ సెన్ట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ – టెక్నాలజీలు సంయుక్తంగా జాతీయాభివృ ద్ధిలో శాస్త్ర సహకారం , మెరుగైన భవిష్యత్తు కోసం మన పర్యావరణం సురక్షితంగా ఉందా ? నేటి యువతలో కుటుంబ విలువలు – సంస్కృతి ప్రభావం అనే మూడు అంశాలపై ‘ శాస్త్ర – సాంకేతిక అంశాలపై అఖిల భారత వ్యాసరచన పోటీలను నిర్వహించాయి . మనదేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన 33 మందిని ఆన్లైన్లో మౌఖికంగా విశ్లేషించి , విజేతలను ఎంపిక చేశారు .

 

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన ఆకాంక్ష చౌహాను రూ .20,000 / – నగదు పురస్కారం , సర్వేల్లోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఆర్యన్ నూకాకు ద్వితీయ బహుమతిగా రూ .15,000 / – , తృ తీయ బహుమతిగా కేరళ – ఎర్రూర్లోని భవన్స్ విద్యా మందిర్కు చెందిన లావణ్య రాజన్ , న్యూఢిల్లీ – చాణక్యపురిలోని నౌకాదళ పాఠశాలకు చెందిన సమ్రాట్ వశిష్ట్ రూ .10,000 / – , మిగిలిన 26 మందికి ఒక్కొక్కరికి రూ .2,000 / -ల నగదు , ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు . ఈ కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఇంజనీరింగ్ డెరైక్టర్ వీకే మిట్టల్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago