Districts

సెన్ట్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది… – గీతం జాతీయ సెన్ట్స్ ఐఏఈఏ పూర్వ నిపుణుడు డాక్టర్ రామ్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు:

శాస్త్రం ( సెన్స్డ్ ) సమాజంతో ముడిపడి ఉందని , అది సమాజాన్ని ప్రభావితం చేస్తుందని , అదే సమయంలో సమాజం వల్ల ప్రభావితమవుతుందని భాభా అణు పరిశోధనా సంస్థ పూర్వ డెరైక్టర్ , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిపుణుడు డాక్టర్ కె.ఎల్.రామకుమార్ అన్నారు . సర్ సీవీ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ను గుర్తుంచుకోవడానికి , మన జాతి , విశ్వాభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతియేటా నిర్వహించే జాతీయ సెన్స్ దినోత్సవాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముందస్తుగా రికార్డు చేసిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , కొత్త శాస్త్రీయ జ్ఞానం నూతన ఆవిష్కరణకు దారితీయొచ్చని , డీఎన్ఏ నిర్మాణం ఆవిష్కరణ జీవశాస్త్రంలో ఒక ప్రాథమిక పురోగతి అని చెప్పారు . ఇది డీఎన్ఏ వేలిముద్రలు , జన్యుపరంగా మార్పిడి చేసిన పంటలు , జన్యు వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో సహా అనేక రకాల ఆచరణాత్మక విధానాలకు దారితీసినట్టు వివరించారు .

నిర్మాణాత్మక యోచన శాస్త్రీయ పరిశోధనలను ప్రేరేపించవచ్చని , మలేరియా వంటి వ్యాధులకు మందులను చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఈ రంగంలోని అనేకమంది పరిశోధకులను సూక్ష్మజీవుల జన్యుశాస్త్రంపై అధ్యయనాలను కొనసాగించడానికి ప్రేరేపిస్తోందన్నారు . శాస్త్రం లేకపోతే సమాజం పురోగమించదని , సమాజానికి ఉపకరించే విధంగా శాస్త్రం తోడ్పడాలని గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ సూచించారు . తొలుత విద్యార్థులందరికీ జాతీయ సెన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . జాతీయ సెన్ట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ – టెక్నాలజీలు సంయుక్తంగా జాతీయాభివృ ద్ధిలో శాస్త్ర సహకారం , మెరుగైన భవిష్యత్తు కోసం మన పర్యావరణం సురక్షితంగా ఉందా ? నేటి యువతలో కుటుంబ విలువలు – సంస్కృతి ప్రభావం అనే మూడు అంశాలపై ‘ శాస్త్ర – సాంకేతిక అంశాలపై అఖిల భారత వ్యాసరచన పోటీలను నిర్వహించాయి . మనదేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన 33 మందిని ఆన్లైన్లో మౌఖికంగా విశ్లేషించి , విజేతలను ఎంపిక చేశారు .

 

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన ఆకాంక్ష చౌహాను రూ .20,000 / – నగదు పురస్కారం , సర్వేల్లోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఆర్యన్ నూకాకు ద్వితీయ బహుమతిగా రూ .15,000 / – , తృ తీయ బహుమతిగా కేరళ – ఎర్రూర్లోని భవన్స్ విద్యా మందిర్కు చెందిన లావణ్య రాజన్ , న్యూఢిల్లీ – చాణక్యపురిలోని నౌకాదళ పాఠశాలకు చెందిన సమ్రాట్ వశిష్ట్ రూ .10,000 / – , మిగిలిన 26 మందికి ఒక్కొక్కరికి రూ .2,000 / -ల నగదు , ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు . ఈ కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఇంజనీరింగ్ డెరైక్టర్ వీకే మిట్టల్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

12 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

12 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

12 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago