సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన నీలం మధు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చి చదువుకునేలాగా ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి దిక్సూచి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిట్కుల్ లోని ఎంఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల హక్కుల సాధనలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. మహిళలు చదువుకోవాలని వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారన్నారు.ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహనీయురాలు చేసిన కృషి తోనే సాధ్యమైందన్నారు.ఆ మహనీయురాలి జయంతిని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…