పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహిళలలకు విద్య,వైద్య,ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తామని ఖానాపురం ప్రవీణ సత్యనారాయణరెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఖనాపురంలో ప్రవీణ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు . మహిళల రక్షణ కోసం షీ టీమ్ లతో పాటు అనే చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాజకీయ రంగంలో మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు . పురుషులతో సమానంగా మహిళలకు సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో కానాపురం ప్రవీణ సత్యనారాయణ రెడ్డి, పటాన్ చెరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, అబ్బగోని సంతోష, కృష్ణవేణి, అక్కమ్మ ,దేవి, శ్రీలత, కళాచారి, భాగ్యలక్ష్మి, అమృతమ్మ, శ్రీకళ, దేవి, బట్టి ఇంద్ర, ఎస్ శ్రీలత, రాణి, దేవి, విజయలక్ష్మి, లావణ్య, జయ శ్రీ, విద్యావతి, నరసమ్మ, మరియు గ్రామ మహిళలు డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామ వివిధ సంఘాల నాయకులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…