Districts

పటాన్ చెరులో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

కెసిఆర్ నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు:

ప్రపంచంలోని అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, శాంతి సహనం ప్రేమతో జీవించాలనే మతాలన్నీ చాటిచెప్పాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు వారి వారి ప్రధాన పండుగలు సంతోషకరంగా నిర్వహించుకోవాలన్న ఉన్నత లక్ష్యంతో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కులం మతం వర్గం తేడా లేకుండా అన్ని మతాల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2001 నుండి తాను స్వయంగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోని ప్రతి చర్చికి క్రిస్మస్ కేక్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఏసు క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయం అన్నారు. నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ చర్చిల ఫాదర్లు, పాస్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం అందించిన క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ప్రియాంక, ఎంపీపీలు దేవానందం, సుష్మ శ్రీ వేణుగోపాల రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ఆయా మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago