మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:
హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్ ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్లో జరగనుంది.హైదరాబాద్లో ఇంతకాలం తర్వాత షో ఎందుకు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్ సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ షో చేయాలనిపించిందని తెలిపారు. అలాగే ఈ కాన్సర్ట్ తెలుగు అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ అవుతుందని, ముఖ్యంగా ఆరంజ్ మూవీ, వాసు మరియు ఘర్షణ సినిమాల పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.ఈ కాన్సర్ట్ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, 13 సింగర్స్ తో పాటలు పాడబోయే గాయకులందరూ ఆ పాటల అసలు గాయకులే కావడం ఈ షోకు ప్రత్యేకమైన ఆకర్షణ అని తెలిపారు. అలాగే ఇంత పెద్ద మరియు వైవిధ్యభరిత గాయకుల లైనప్ ఉండటంతో పాటల ఎంపికలో చాలా కష్టపడ్డామని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని జోరా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఇది అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించే కార్యక్రమంగా, హైదరాబాద్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సంగీత వేడుకగా నిలుస్తుందని తెలిపారు.
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…