– గీతం వర్క్షాప్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ స్పష్టీకరణ
మనవార్తలు ,పటాన్ చెరు:
ఒక నిర్దిష్ట వాతావరణంలో , తగిన సమయ వ్యవధిలో , వెఫల్యం లేకుండా , ఉద్దేశించిన పనితీరును నిర్వర్తించడమే విశ్వసనీయ సాంకేతికత అని అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పుచ్చా అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ‘ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . విశ్వసనీయ సాంకేతికత లక్ష్యం ఒక ప్రక్రియ స్వాభావిక విశ్వసనీయతను మూల్యాంకనం చేయడమని ఆయన చెప్పారు .
ఒక వంతెన , రిజర్వాయర్ లేదా భవన నిర్మాణంలో కాంక్రీటు నాణ్యత ముఖ్య భూమిక పోషిస్తుందని , అందువల్ల నాణ్యతపై నిరంతర నియంత్రణ అవసరమని ఆయన స్పష్టీకరించారు . కాంక్రీటు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఉదాహరణలతో సహా వివరించారు . ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు జవాబివ్వడమే కాకుండా స్వీయ అనుభవాలను కూడా సదస్యులతో పంచుకున్నారు .
P తొలుత , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావుతో కలిసి సివిల్ విభాగాధిపతి డాక్టర్ బీఎస్ఆర్కే ప్రసాద్ అతిథిని స్వాగతించి , సత్కరించి , సదస్యులకు పరిచయం చేశారు . ఇంజనీరింగ్ అధ్యాపకులు , విద్యార్థులు , పరిశోధకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు .
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్చెరు…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…