Telangana

చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

_ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ 

_దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతం

_నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని . సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం విమానయానం టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ల ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఆ రంగాన్ని ప్రోత్సహించాడని తెలిపారు. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన ఆ సంస్కరణలతోనే ప్రస్తుతం దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహనీయుడీ సొంతమన్నారు.భారత దేశ అభివృద్ధికి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని ప్రపంచంలో అభివృద్ధి లో మేటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసి చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొట్టు అశోక్, వి నారాయణ రెడ్డి,గోపాల్,వెంకటేశ్,మురళీ, రాజ్ కుమార్,లత,శశికళ,కృష్ణ,శ్రీను, అనిల్, తదితరులు, పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago