మనవార్తలు ,పటాన్చెరు:
రేడియో ఐసోటోప్లు , నియంత్రిత రేడియేషన్లను పంటల మెరుగుదల , ఆహార సంరక్షణ వంటి వాటికి వినియోగిస్తున్నట్టు భాభా అణు పరిశోధనా సంస్థ ఫుడ్ టెక్నాలజీ డివిజన్ అధిపతి డాక్టర్ ఎస్.గౌతమ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో గురువారం ఆయన ‘ వ్యవసాయం , ఆహార ఉత్పత్తుల సంరక్షణలో రేడియో ఐసోటోప్లు , రేడియేషన్ సాంకేతికత వినియోగం’పై వర్చువల్గా ఉపన్యసించారు . వ్యవసాయ , ఆహార ఉత్పత్తుల సంరక్షణకు అయోనెజింగ్ రేడియేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు . మన దైనందిన జీవితంలో వినియోగించే అనేక ఉత్పత్తులు రేడియేషన్ నుంచి ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందినట్టు ఆయన చెప్పారు . రేడియేషన్ ద్వారా కొన్ని రోజుల పాటు కొన్ని ఆహార పదార్థాల షెల్ప్ జీవితాన్ని పొడిగించడం వల్ల అవి పాడెపోకుండా ఉంటాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు .
ఆహార వికిరణం సుదీర్ఘ షెల్ప్ జీవితంలో సురక్షితమై ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు . కొన్ని విత్తనాలు , తయారుగా ఉన్న ఆహారాన్ని సున్నితంగా రేడియేషన్కు గురిచేయడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చని ఆయన తెలిపారు . మనదేశంలో వాషి – నవీ ముంబై నాసిక్లోని లాసల్గావ్లో రెండు కర్మాగారాలు ఉన్నాయని , ఈ రెండు సుగంధ ద్రవ్యాలు , ఉల్లిపాయలు , పండ్ల ప్రాసెసింగ్ కోసం రేడియేషన్ సేవలను అందిస్తున్నట్టు డాక్టర్ గౌతమ్ పేర్కొన్నారు .
గత 30 ఏళ్ళగా రేడియేటెడ్ ఫుడ్స్ని పరీక్షిస్తున్నా , అటు జంతువులకు కానీ , ఇటు మానవులకు గానీ ఎలాంటి హానికరమైన ప్రభావాలు కనిపించలేదని ఆయన చెప్పారు . ఈ నేపథ్యంలో సాధారణ వినియోగం కోసం కొన్ని రేడియేషన్ ఆహారాలు విడుదలవుతున్నట్టు డాక్టర్ గౌతమ్ తెలియజేశారు . రేడియేషన్ సేవలు అందించాలని అభిలషించే ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ సౌకర్యం కల్పిస్తోందని , వ్యక్తులుగా లేదా సహకార సంఘాలుగా ఏర్పడి పరిశ్రమలను నెలకొల్పవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు . డాక్టర్ గౌతమ్ తరఫున బార్క్ నుంచి వచ్చిన డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీకి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు జ్ఞాపికను అందజేశారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…