మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
సర్వం కోల్పోయి కూడు,గూడు, గుడ్డ లేక నిస్సహస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆర్ .కే .వై. టీం ముందుకు వచ్చిoదని ఆర్ కె వై టీమ్ సభ్యులు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ ఎం.ఎం .టి .ఎస్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకొని వారికి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేతులు మీదుగా దుప్పట్లు పంపిణీ చేయించడం జరిగిందని, ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు. సేవాకార్యక్రమాలు చేపడుతున్న టీమ్ సభ్యులను రవికుమార్ యాదవ్ అభినందించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇలాంటి నిరు పేదలు ఎంతో మంది నివసిస్తున్నారని వారందరికీ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించినట్లయితే మీరంతా ఇలా రోడ్లపై నివసించే పరిస్థితి ఉండదని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్.గణేష్ ముదిరాజ్.సోమయ్య.అకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాము, .మధు,.సంతోష్, క్రాంతి, .చంద్ర మసి రెడ్డి. పాపయ్య, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు .
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…