Telangana

సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

కార్మికులకు అండగా సిఐటియు ఎర్ర జెండా

పెన్నార్ కార్మికులు సీఐటీయూలోకి

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

సిఐటియు ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో కార్మికులు సిఐటియులో చేరుతున్నారని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో పెన్నార్ పరిశ్రమ కార్మికులు సీఐటీయూలోకి చేరడం జరిగినది. కార్మికులకు శాలువాలు కప్పి సిఐటియూ లోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ పెన్నార్ పరిశ్రమ కార్మికులు సిఐటీయూ లోకి పలుటపాలుగా చేరడం జరుగుతుందని, కార్మికులు నమ్ముకున్న ఎర్రజెండా కార్మికులకు అండగా ఎప్పుడు ఉంటుందన్నారు. సిఐటియు ద్వారానే కార్మికుల సంక్షేమ సాధ్యమని, కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. నిత్యము కార్మికులకు అండగా ఉంటూ పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. అనేక పరిశ్రమలలో అనేక విజయాలు సాధించిన చరిత్ర సిఐటియుకు ఉందని, మెరుగైన వేతన ఒప్పందాలు, సమస్యల పరిష్కారం వంటివి సిఐటియు సాధిస్తుందని తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.రాజ్ కుమార్, రామచందర్, సోమలింగం, రాజు, అంకారావు, రాథోడ్, బాబు, ధర్మారావు, నాయక్, రవీందర్ తదితర కార్మికులు చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య ,ప్రవీణ్ రెడ్డి, హరిహర తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago