_హుడా సెక్రటరీ కి వినతి పత్రం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ మున్సివల్ పరిధిలో హుడా స్థలాన్ని కాపాడాలంటు హుడా సెక్రటరీ చంద్రయ్యకు గురువారం స్థానిక బొల్లారం వాసులు వినతి పత్రన్ని అందచేశారు. మున్సిపల్ పరిధిలో చాలా స్థలం ప్రభుత్వానికి సంబందించిన హుడా సర్వే నెంబర్ లలో ఉందని చెప్పారు. సర్వే నెంబర్ 23, 42, 44, 233, 254, 268, 278, 280, 284, 15 లోని ప్రభుత్వానికి సంబందించిన హుడా స్థలంలో గత కొన్ని రోజుల నుండి అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారని అన్నారు. ఈ విషయంపై చాలా సార్లు అధికారులకు పిర్యాదు చేసిన అడ్డుకోవాల్సిన అధికారులే వాళ్ళతో చేతులు కలిపి వాళ్లకు మద్దత్తుగా నిలబడి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది క్రైస్తవులు చర్చ్ నిర్మాణం చేపట్టారని,ఈ విషయంపై హుడా అధికారులకు పిర్యాదు చేయడంతో ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేత జరిపారని, అయితే కూల్చివేత జరిపిన కొన్ని గంటలవ్యవధిలోనే కొంతమంది క్రైస్తవులు అక్కడ సిలువ ఏర్పాటు చేసారు. దేవుళ్ళ గుట్ట అంటే హిందూ దేవాలయలే నిర్మాణం చేపట్టాలని అన్య మతస్తులు దేవాలయలు అక్కడ నిర్మాణం చేపడితే రానున్న రోజుల్లో మతవిబేధాలు వస్తాయని,అది గొడవలకు దారి తీస్తుందని కావున అక్కడ చర్చ్ నిర్మాణం చేపట్టకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ ధర్మ ప్రసార కో కన్వీనర్ తెలంగాణ సుభాష్ చందర్, బీజేపీ సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, ఎస్సి ఉప కులాల రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం, బీజేపీ సీనియర్ నాయకులు జి. రాఘవేంద్ర రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు వెంకటయ్య, గోపీ, లాలప్ప, లాలయ్య, స్వామి, పండరి, తదితరులు ఉన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…