politics

ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా.. ప్రలోభాలకు గురి కావద్దు!

మా మూవీ ఎలెక్షన్స్:

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (MAA) ప్రచారం రంజుగా సాగుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రకాష్ రాజ్ ఓ మాట అంటే, మంచు విష్ణు రెండు అంటున్నాడు. మంచు విష్ణు కామెంట్స్ కు వెంటనే ప్రకాష్ రాజ్ సమాధానం ఇస్తున్నాడు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. నిన్న మంగళవారం ప్రకాష్ రాజ్ మీడియా ముందుకొచ్చి దొంగనోట్ల ఆరోపణ చేస్తే.. మంచు విష్ణు అంతకు మించిన మాటలతో ప్రకాష్ రాజ్ వర్గానికి సమాధానమిచ్చాడు.

ప్రధాన అభ్యర్థులే.. ప్రత్యర్ధులై మాటల దాడికి దిగితే మిగతా సభ్యులు కూడా అదే దారిలో సోషల్ మీడియాలో ఫోకస్ చేసి ఎన్నికలఫై వేడి పెంచేస్తున్నారు. ఇక, ఈ రెండు ప్యానళ్లకి సపోర్ట్ చేసే మిగతా సెలబ్రిటీలు సైతం తల ఒక మాట సాయం చేసి ఎవరికి వారు వాళ్ళకి నచ్చిన వారికి ప్రచారం చేసి పెడుతున్నారు. ముందునుండే మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు అండగా ఉందని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ అంశంలో ఎక్కడా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు కానీ.. నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ వైపు బలంగా ఉన్నారు.

తాజాగా.. ఈ ఎన్నికలపై స్పందించిన నాగబాబు.. మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ నిలబడతారని అసలు ఊహించలేదని.. ఒక సినిమాకి కోటి రూపాయలు తీసుకొనే ప్రకాష్ రాజ్ కోట్లు వదిలేసుకొని ఈ ఎన్నికల కోసం వస్తారని అనుకోలేదని.. అలాంటి వారిని కించపరుస్తారా అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ ను తెలుగోడు కాదనే వాళ్ళు అసలు సినిమాకి అవసరమా అని నాగబాబు ప్రశ్నించారు. బాబు మోహన్ లాంటి వాళ్ళకి ప్రకాష్ రాజ్ అంటే అంత చులకనా అని నాగబాబు ప్రశ్నించారు. మా సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని నాగబాబు అన్నారు

 

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

12 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

12 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

12 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

12 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

12 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago