పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
_సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో..
ఇండ్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ కాలనీలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నర్సింలు, డిసిసిబి డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, మాణిక్ రెడ్డి, దుర్గా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…