అమీన్పూర్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో పండు టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజన్ 8 రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాలుగా అమీన్పూర్ వేదికగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. స్వతహాగా క్రీడలు అంటే తనకు ఇష్టమని, కబడ్డీ అంటే అమిత ఆసక్తి అన్నారు. నియోజకవర్గ పరిధిలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కబడ్డీ పోటీలకు రెండు లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో 60 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ దేవానంద్, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, కబడ్డీ సంఘం ప్రతినిధి ఎల్లయ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…