Telangana

అణు నిర్మాణాల గణిత నమూనాపై పరిశోధనకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని జైనా ప్రణవి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘టోపోలాజికల్ సూచికలను ఉపయోగించి అణు నిర్మాణాల గణిత నమూనా రూపకల్పన, గ్రాఫ్ సైద్ధాంతిక విధానం’పై ఆమె పూర్తి స్థాయి పరిశోధక విద్యార్థిగా అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జె. విజయశేఖర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ డాక్టరల్ పరిశోధన, గణనపరంగా అధిక శ్రమతో కూడిన క్వాంటం-రసాయన పద్ధతులపై ఆధారపడకుండా, అణు నిర్మాణాలకు నమూనా రూపొందించడానికి, వాటి భౌతిక, రసాయన ధర్మాలను కచ్చితంగా అంచనా వేయడానికి గ్రాఫ్ సిద్ధాంతం యొక్క అనువర్తనాన్ని అన్వేషిస్తుందని వివరించారు.

ఈ పరిశోధన, అలిఫాటిక్ కీటోన్లు, కొవ్వు ఆమ్లాలు, క్యాన్సర్ నిరోధక సమ్మేళనాలతో సహా వివిధ రకాల అణువులను విశ్లేషించడానికి టోపోలాజికల్ సూచికల ఆధారంగా గణిత నమూనాలను అభివృద్ధి చేసిందన్నారు. ఈ నమూనాలు బాష్పీభవన స్థానం, ద్రవీభవన స్థానం, మోలార్ ఘనపరిమాణం, ఎంథాల్పీ, పోలరైజేషన్ వంటి కీలక అణు ధర్మాలను అధిక కచ్చితత్వంతో విజయవంతంగా అంచనా వేసినట్టు తెలిపారు.ఈ అధ్యయనం గ్రాఫ్ సిద్ధాంతాన్ని మాలిక్యులర్ మోడలింగ్ కోసం ఒక సరళమైన, నమ్మదగిన, గణనపరంగా సమర్థవంతమైన విధానంగా రుజువు చేస్తుందన్నారు. ఇది కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ పరిశోధన, మెటీరియల్స్ సైన్స్, ఔషధ ఆవిష్కరణలో ముఖ్యమైన అనువర్తనాలను అందిస్తుందని తెలిపారు. ఇది గ్రాఫ్ సిద్ధాంతం, మాలిక్యులర్ సైన్స్ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న గణిత రసాయన శాస్త్ర రంగాన్ని కూడా బలపరుస్తుందన్నారు.

అదే సమయంలో, కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ను ఏకీకృతం చేసే భవిష్యత్తు పరిశోధనలకు బలమైన పునాదిని అందిస్తుందని వివరించారు.డాక్టర్ ప్రణవి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago