పరిమళించిన మానవత్వం…
– కాలిబాటన వెళ్తున్న వృద్ధులకు వాహనం ఏర్పాటు
– మహేష్ పాటిల్ ను అభినందించిన స్థానికులు
హైదరాబాద్:
లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేక ఇద్దరు వృద్ధులు కాలిబాటన నడుచుకుంటూ వెళ్తుంటే ఇది గమనించిన టిఆర్ఎస్ కెవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ వారికి వాహనం ఏర్పాటు చేసి గ్రామానికి పంపించారు… వివరాల్లోకి వెళితే..
బీదర్ నుండి ఓ వృద్ధ దంపతులు ఆటోలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. అప్పటికి సమయం పది దాటడంతో లాక్ డౌన్ కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఇద్దరు వృద్ధులు నడుచుకుంటూ మిర్జాపూర్ కు చేరుకున్నారు. ఇది గమనించిన టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు బగ్గీ మహేష్ పాటిల్ స్థానికంగా ఉన్న క్యాబ్ డ్రైవర్ సుమన్, మరో వ్యక్తి కృష్ణ తో మాట్లాడి నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వృద్ధులను వారి గ్రామం పంపాడు లో వదిలి రావాలని చెప్పి, నగదు ఇచ్చి పంపించారు. ఇది గమనించిన స్థానికులు మహేష్ పాటను అభినందించారు. అదేవిధంగా వృద్ధ దంపతులు మహేష్ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మహేష్ పాటిల్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశిస్తూ ఉంటే, వారికి ప్రజలు సహకరించాలని, అలాకాకుండా ఇష్టారాజ్యంగా రోడ్ల పై తిరుగుతే కేసు నమోదు అవుతాయి అన్నారు. అత్యవసరమైతేనే బయటకు డబుల్ మాస్కులు ధరించి బయటకు రావాలన్నారు. అనంతరం ఆ వృద్ద దంపతులకు నచ్చజెప్పి కారులో వారి గ్రామానికి పంపించారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…