Telangana

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్ చెరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తిస్థాయిలో పని చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని కోరారు.

అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ , పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించే నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న మొట్టమొదటి నియోజవర్గం పటాన్చెరు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా నియోజకవర్గంలో 90% క్రీడా ప్రాంగణాలు ప్రారంభించడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

పటాన్ చెరు మండల పరిధిలోనీ 9 అంగన్ వాడి కేంద్రాల భవనాల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని, ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముత్తంగి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎల్లప్పుడు తాను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా పటాన్ చెరు బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో 16 కోట్ల రూపాయలతో భారీ ఆడిటోరియం నిర్మిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల సమయాల్లోనే రాజకీయాల గురించి మాట్లాడాలని, తదనంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా చర్చలు జరగాలని కోరారు. ప్రస్తుత హైటెక్ యుగంలోనూ కొన్ని కొన్ని చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, తాసిల్దార్ మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago