మనవార్తలు ప్రతినిధి , జిన్నారం :
గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని త్వరలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం ఉదయం ఖాజిపల్లి పరిధిలోని జిఎంఆర్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సర్వేనెంబర్ 181 లో ప్రజల సౌకర్యార్థం గుడి, మసీదు, చర్చి, స్మశాన వాటిక, అంగన్వాడి, చట్ పూజ ఘాట్, క్రీడా మైదానం, ప్రాథమిక పాఠశాల నిర్మాణాలకు త్వరలో స్థలాలు కేటాయించి..భవన నిర్మాణాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిఎంఆర్ కాలనీలో గ్రామ దేవత గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుష్మ శ్రీకాంత్, తహసిల్దార్ ఆంథోనీ, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…