politics

స్టార్టప్లకు ప్రోత్సాహంపై గీతమ్లో ఒకరోజు సదస్సు…

మనవార్తలు , పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) సంయుక్తంగా ఈనెల 28 న గీతం ప్రాంగణంలో ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . వ్యాపారం చేయాలనే ఆలోచన దశ నుంచి వాణిజ్యీకరణ వరకు వ్యవస్థాపక ప్రయాణం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు . మనదేశంలోని స్టార్టప్లు , వ్యవస్థాపకులకు వివిధ సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు , రాయితీలు , సహాయ వ్యవస్థలపై అంతర్దృష్టులను అందించడం ఈ సమ్మేళనం లక్ష్యమన్నారు .

యువతలో పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచనను కల్పించడం , పరిశ్రమ స్థాపనకు అవసరమైన మెళకువలను తెలియజేయడం , ప్రతిపాదిత స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం చేయడం ఈ సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు . సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వివిధ సంస్థల నిపుణులు , వ్యవస్థాపక ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న ముఖ్య అధికారుల ఆలోచనలు , అనుభవాలను ఈ వేదిక నుంచి పంచుకుంటారని డెరైక్టర్ తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో బృంద చర్చలు , విజయగాథలు , సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి వంటి వాటిపై నిపుణుల మార్గదర్శనం ఉంటుందన్నారు . ఇవన్నీ పరిశ్రమ నెలకొల్పాలనే యోచన ఉన్నవారికి ఓ లోతైన అవగాహన కల్పిస్తాయని ఆయన తెలిపారు . యూజీ , పీజీ విద్యార్థులు , పరిశోధకులు , అధ్యాపకులు , వర్ధమాన పారిశ్రామికవేత్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చన్నారు . పేర్ల నమోదు , చివరి తేదీ వంటి వివరాల కోసం 98490 66459 ని సంప్రదించాలని , kkuchima@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని లేదా www.ghbs.in ను సందర్శించాలని ప్రొఫెసర్ కరుణాకర్ సూచించారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago