Districts

ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

మన వార్తలు శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనిలోని వీఆర్ అశోక్ గ్రాండ్ లో బీజేపీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మొవ్వా సత్యనారాయణ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలే భాస్కర్ మాట్లాడుతూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఓబీసీ కమిషన్ కు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించిన మాన్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిసి లకు 2500 కోట్లు,నాయి బ్రాహ్మణ కుల సోదరులకి మరియు రజక సోదరులకు చేరో 250 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని, సెలూన్ షాపులకు మరియు దోభి ఘాట్ లకు ఉచిత కరెంట్ హామీని ఇస్తానని చెప్పి ఇంతవరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా వీరికి ఉచిత కరెంటు, నిధులు ఇవ్వాలని తీర్మాణం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు ఉన్నటువంటి 34 శాతం రిజర్వేషన్ ని తెరాస ప్రభుత్వ 23 శాతానికి తగ్గించి స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీ నాయకత్వానికి అన్యాయం చేసిన కేసీఆర్ వెంటనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలని తీర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్ రావు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, రాజు, వెంకటేష్, దశరథ్ సాగర్, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago