Districts

ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

మన వార్తలు శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనిలోని వీఆర్ అశోక్ గ్రాండ్ లో బీజేపీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మొవ్వా సత్యనారాయణ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలే భాస్కర్ మాట్లాడుతూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఓబీసీ కమిషన్ కు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించిన మాన్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిసి లకు 2500 కోట్లు,నాయి బ్రాహ్మణ కుల సోదరులకి మరియు రజక సోదరులకు చేరో 250 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని, సెలూన్ షాపులకు మరియు దోభి ఘాట్ లకు ఉచిత కరెంట్ హామీని ఇస్తానని చెప్పి ఇంతవరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా వీరికి ఉచిత కరెంటు, నిధులు ఇవ్వాలని తీర్మాణం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు ఉన్నటువంటి 34 శాతం రిజర్వేషన్ ని తెరాస ప్రభుత్వ 23 శాతానికి తగ్గించి స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీ నాయకత్వానికి అన్యాయం చేసిన కేసీఆర్ వెంటనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలని తీర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్ రావు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, రాజు, వెంకటేష్, దశరథ్ సాగర్, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

4 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

6 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago