రామచంద్రపురం
తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా గొర్రెలతో పాటు మేపేందుకు ప్రతి గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి చేపడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెలతో పాటు స్థలం కేటాయిస్తే గొర్రెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు.
గ్రామాల్లో ఉండడానికి ఇండ్లు సరిపడక ఇబ్బందులు పడుతున్న గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంపకం కష్టంగా మారిందన్నారు. స్థలం లేక మొదటి విడతలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను పెంచడానికి, మేపడానికి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం గొర్రెలతో పాటు వాటిని మేపేందుకు స్థలం కేటాయిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదే విధంగా గతం లో ఉన్న గొర్రెలకు కూడ ఇన్సూరెన్సు వర్థింపచెయలని చుచించారు. రెండో విడత పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు గొర్రెలతో పాటు ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…