93 సొసైటీ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నిక

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ :

తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేస్–02లో 93 సొసైటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. అధ్యక్షురాలిగా బి. నళిని, ఉపాధ్యక్షురాలిగా వి. సునీత, కార్యదర్శిగా అస్మా అంజుమ్, సంయుక్త కార్యదర్శిగా కె. పవన్ జ్యోతి, కోశాధికారిగా ఎం. సునీత, డైరెక్టర్లుగా ఇష్రైతి బేగం, ఈలా పటేల్, జె. దీప, డి. పార్వతి నియమితులయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీరాధర్ ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, సురేష్, పాండు, రవి, అనిల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *