సీసీ రోడ్డు రోడ్డు పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శ్రీకారం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ :

రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్‌లోని సైబర్ కాలనీ బి మ్యాథ్స్‌లో రూ.7 లక్షల వ్యయంతో 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ సొంత నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు కంజర్ల శ్రీశైలం, నాగరాజు, బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు దయాకర్ రెడ్డి, గుడ్ల సాగర్, ఇంద్రారెడ్డి, బొల్లారం శ్రీశైలం, గ్రామస్తులు రవీందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, కుమ్మరి రాజు, మల్లయ్య, శ్రీశైలం, B మ్యాథ్స్ అధ్యక్షుడు కె. సంజీవ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పి. మాధవరావు, ప్రధాన కార్యదర్శి డి. ఏడుకొండలు, సంయుక్త కార్యదర్శి బి. ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి జె. వాసుదేవరావు, డైరెక్టర్లు వి. గోవర్ధన్, ఎం. సందీప్ రెడ్డి, యు. సురయ్య, ఎం. ఆనంద్, మాజీ అధ్యక్షుడు జె. శివనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *