Categories: politics

వాతావరణ మార్పుల వల్ల బహుముఖ సవాళ్లు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న స్కాట్ లాండ్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ రంజన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వాతావరణ మార్పుల వల్ల మనం బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నామని, మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని స్కాట్ లాండ్ లోని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం పర్యావరణ, వాతావరణ న్యాయ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ రంజన్ హితవు పలికారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో ‘చిక్కుబడ్డ సంక్షోభం: హిమాలయాల్లో పర్యావరణ విధ్వంసం, న్యాయం’ అనే అంశంపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. వాతావరణ మార్పు, విపత్తుల సాంద్రత, తీవ్రతపై, ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో సంభవిస్తున్న పరిణామాలపై ఆయన దృష్టి సారించారు. దీనికి గల సాంకేతిక పరిష్కారాలను పదే పదే ప్రస్తావిస్తూనే, ఈ సంక్షోభాల భావోద్వేగ, మానవ కోణాలను విస్మరించడాన్ని ఆయన తప్పు పట్టారు.

డాక్టర్ రంజన్ తన వినూత్న పరిశోధన ద్వారా హిమాలయ ప్రాంతంలో వాతావరణ వైపరీత్యాల లోతైన చిక్కులను అర్థం చేసుకోవడానికి శోకంని ఒక ముఖ్యమైన అంశంగా పరిచయం చేశారు. వాతావరణ సంక్షోభం చుట్టూ మన కథనాలను రూపొందించడంలో మానవ బాధలను గుర్తించడం, ధృవీకరించడం చాలా అవసరమని ఆయన వాదించారు. వాతావరణ మార్పు ప్రభావిత కమ్యూనిటీలపై తీసుకునే భావోద్వేగ నష్టాన్ని బహిరంగంగా గుర్తించాలని సూచించారు.ఈ చర్చలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని, వాతావరణ విపత్తుల యొక్క మానవ కోణాలను అన్వేషించడానికి, వాతావరణ సంభాషణలో భావోద్వేగ కథనాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago