మన వార్తలు , హైదరాబాద్
లాక్డౌన్ కారణంగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. దీంతో మూడ్రోజులకోసారి డయాలసిస్ తప్పనిసరైంది. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు దొరికిన చోటల్లా అప్పులు చేశారు.
అయితే చివరగా చేసిన డయాలసిస్ చేసే సమయంలో అతని ఆరోగ్యం మరింత విషమించింది. కుమారుడికి కిడ్నీ ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో తమకెవరైనా సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
ఈ విషయాన్ని ఒక నెటిజన్ గమనించి, తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. సర్ ఈ పిల్లాడికి ఏమైనా సాయం చేయండి అని వేడుకున్నాడు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా వెంటనే స్పందించిన కేటీఆర్.. ఈ సమస్యను తాము చూసుకుంటామని చెప్పారు. నిమ్స్ ఆస్పత్రి వర్గాలతో కలిసి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు…
వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…
అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :…