గీతం కీలకోపన్యాసంలో పేర్కొన్న
జేఎన్ యూ ఆచార్యుడు ప్రొఫెసర్ ఉదయ కుమార్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
భారతీయ నవల, సామాజిక వాస్తవికత, సామూహిక అనుభవంతో వేళ్లూనుకుందని, ముఖ్యంగా ఆధునిక వాస్తవిక కల్పనగా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రొఫెసర్ ఉదయ కుమార్ అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘పరివర్తన దశ: భారతదేశంలో సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల చర్చాగోష్ఠిలో శుక్రవారం ఆయన కీలకోపన్యాసం చేశారు.సాహిత్యం అనే భావనను ఒక పరిమిత అభ్యాసంగా పేర్కొంటూ, ఇది స్థిర నిర్వచనాలను నిరోధించి, ఉన్నత వర్గాల మధ్య ఉంటుందని అన్నారు. సాహిత్యం గత శతాబ్దంన్నర కాలంలో పరిణామం చెందుతూ, ప్రజాక్షేత్ర విశ్వాసంపై ఆధారపడి, అనామక పాఠకులను ఉద్దేశించిందని చెప్పారు. భౌతిక, సామాజిక, సౌందర్యేతర పరిస్థితుల ద్వారా రూపొందించిన ఆధునిక నిర్మాణంగా ఇది ఉద్భవించిందన్నారు. సాహిత్యం యొక్క ఈ అవగాహన సమకాలీన కాలంలో గణనీయమైన పరివర్తనకు గురవుతోందని స్పష్టీకరించారు.
మలయాళ సాహిత్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, ముఖ్యంగా సి.అయ్యప్పన్, దళిత రచయిత రచనలను ఆయన ప్రస్తావించారు. ‘పగటిపూట’, ‘రాత్రిపూట’ కథనాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఈ రచనలు కేరళలో, ముఖ్యంగా కుట్టనాడ్ వంటి ప్రాంతాలలో కుల అణచివేత, సౌందర్య బానిసత్వం, సామాజిక బాధల చరిత్రలను ఎలా ప్రేరేపిస్తాయో ప్రొఫెసర్ కుమార్ వివరించారు. ఈ కథనాలు సమూహం యొక్క పరిశుభ్రమైన, లేదా జాతిపరమైన ప్రాతినిధ్యాలను ఎలా ప్రతిఘటిస్తాయో, సమ్మిళితత్వం, సామాజిక ఊహ యొక్క ఆధిపత్య భావనలను సవాలు చేసే సంక్లిష్టమైన, మూర్తీభవించిన సామాజిక అనుభవాలను ఎలా ఎలుగెత్తి చాటుతాయో విశ్లేషించారు.తొలుత, డాక్టర్ జోమీ అబ్రహం, అతిథిని పరిచయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ వివరణతో ముగిసింది. జీఎస్ హెచ్ఎస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ ధరు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రశ్నించి, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…
– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…