Districts

ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు

ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీ లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, ఆబిద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం తో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తమ రంగవల్లుల లో పొందుపరచడం పట్ల ఆయన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 100 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, సర్పంచ్ ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు రామకృష్ణ, రవి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

___________________________________________________________

_క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం

_లక్డారం ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల పరిధిలోని లక్దారం గ్రామంలో లక్డారం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లక్డారం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, విజయ్ కుమార్, అఫ్జల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

12 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

12 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

12 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago