మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రతి కాలనీకి విస్తరిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ లో ఇంటింటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గం నేడు గేటెడ్ కమ్యూనిటీ లకు సెంటర్ గా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నూతన కాలనీలకు మిషన్ భగీరథ విస్తరించాలని జలమండలి అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…