పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని ,ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని , పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .భక్తులందరూ కరోనా నిబంధనలకు అనుగుణంగా హాజరు కావాలని ఆయన సూచించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సంపూర్ణ సహకారం అందించారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…