పటాన్చెరు
పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సమిష్టి సహకారం తో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 270 పడకలతో ఏర్పాటు కాబోతున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించిన స్థలం సంబంధిత శాఖకు బదిలీ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నరసింహ గౌడ్, రాములు గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, నగేష్ యాదవ్, విజయ్ కుమార్, బాల్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, పాండు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…