మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరి మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 54 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో మిగతా పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకొని.. ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో తాత్సారం చేయవద్దని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…