మనవార్తలు ,పటాన్చెరు/అమీన్పూర్:
కార్తీకమాసం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయా సంఘాలు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు మండలం రామేశ్వరంబండ, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణాల్లో వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామూహిక వన భోజనాల కార్యక్రమం ద్వారా వ్యక్తులు, కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతీ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, బాల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…