పటాన్చెరు
పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిని ఏర్పాటుకు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుని ఉంటారని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సతీమణి గూడెం యాదమ్మ లను ఘనంగా సన్మానించారు. నూతన ఆసుపత్రి ఏర్పాటుతో నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందన్నారు.
పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకటరెడ్డి, గుమ్మడిదల ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…