పటాన్చెరు
పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిని ఏర్పాటుకు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుని ఉంటారని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సతీమణి గూడెం యాదమ్మ లను ఘనంగా సన్మానించారు. నూతన ఆసుపత్రి ఏర్పాటుతో నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందన్నారు.
పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకటరెడ్డి, గుమ్మడిదల ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…