Telangana

పటాన్చెరులో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, హరితహారం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి యువతకు ఆశా కిరణంగా నిలిచిన మహోన్నత నాయకుడు మంత్రి కేటీఆర్ అని ప్రశంసించారు. తన జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటాలకు దూరంగా నిర్వహించాలన్న మంత్రి సూచన మేరకు.. అమీన్పూర్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, హెచ్డిసి కమిటీ మెంబర్ శ్రీను, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

_అనాధ ఆశ్రమం లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..

_మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటన..

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.తన పుట్టినరోజును హంగు ఆర్భాటాలకు దూరంగా నిరుపేదల సంక్షేమానికి అండగా నిలుస్తూ నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. మహిమా మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనాధ పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తల్లిదండ్రులను కోల్పోయి మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాధ పిల్లలను చేరదీసి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.ఆశ్రమంలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో భోజనం, యూనిఫామ్, ఉన్నత విద్యను అందించనున్నట్లు తెలిపారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago