మన వార్తలు , పటాన్ చెరు:
పటాన్చెరు లోనీ కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఆల్విన్ కాలనీలో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరుగుతుందన్నారు.భారీ వర్షాలు కురిసినప్పుడల్ల నాలా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలనీల రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుందని అన్నారు.నందన్ రతన్ కాలనీలో గత సంవత్సరం అదే జరిగిందనితెలిపారు . ఈ అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితే బండ్లగుడ,నందన్ రతన్ ప్రైడ్, ట్రాంజెల్,ఆల్విన్ కాలనీలలోని మురుగు నీరు మరియు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా సులువుగా ఈ నాలా ద్వారా వెళ్ళిపోతాయని తెలియజేశారు.సుమారు రూపాయలు 2 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ గారికి శాలువాతో సన్మానం చేశారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…