మన వార్తలు , పటాన్ చెరు:
పటాన్చెరు లోనీ కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఆల్విన్ కాలనీలో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరుగుతుందన్నారు.భారీ వర్షాలు కురిసినప్పుడల్ల నాలా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలనీల రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుందని అన్నారు.నందన్ రతన్ కాలనీలో గత సంవత్సరం అదే జరిగిందనితెలిపారు . ఈ అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితే బండ్లగుడ,నందన్ రతన్ ప్రైడ్, ట్రాంజెల్,ఆల్విన్ కాలనీలలోని మురుగు నీరు మరియు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా సులువుగా ఈ నాలా ద్వారా వెళ్ళిపోతాయని తెలియజేశారు.సుమారు రూపాయలు 2 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ గారికి శాలువాతో సన్మానం చేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…