మన వార్తలు , పటాన్ చెరు:
పటాన్చెరు లోనీ కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఆల్విన్ కాలనీలో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరుగుతుందన్నారు.భారీ వర్షాలు కురిసినప్పుడల్ల నాలా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలనీల రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుందని అన్నారు.నందన్ రతన్ కాలనీలో గత సంవత్సరం అదే జరిగిందనితెలిపారు . ఈ అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితే బండ్లగుడ,నందన్ రతన్ ప్రైడ్, ట్రాంజెల్,ఆల్విన్ కాలనీలలోని మురుగు నీరు మరియు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా సులువుగా ఈ నాలా ద్వారా వెళ్ళిపోతాయని తెలియజేశారు.సుమారు రూపాయలు 2 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ గారికి శాలువాతో సన్మానం చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…