కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎం.పి.రఘునందన్ రావు లకు వినతిపత్రం అందజేత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు విస్తరించాలని మెట్రోరైల్ సాధన సమితి అధ్యక్షులు మాజీ ఎంఎల్ఏ కే. సత్యనారాయణ మరియు సభ్యుల అధ్వర్యంలో కేంద్రబొగ్గుగనుల శాఖా మంత్రివర్యులు కిషన్ రెడ్డి , మెదక్ ఎంపీ రఘునందన్ రావు లకు వినతిపత్రం అందించారు . గత ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు ను విస్తరించాలని ప్రతిపాదించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీ.వో లో పటాన్ చెరు వరకు మాత్రమే ప్రతిపాదించిందని , సంగారెడ్డి జిల్లాకు లాభం జరగాలంటే పారిశ్రామిక వాడ ఇస్నాపూర్ పూర్ వరకు మెట్రో ను పొడగించాల్సిందే అని మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేయడం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేవిధంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి వర్యులను కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘురందన్ రావు ని కోరారు , వారు సానుకూలంగా స్పందించినట్టు మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు తెలిపారు .ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ , అబ్దుల్ బాసిత్, ఈర్ల రాజు ముదిరాజ్, మెట్టు శ్రీధర్, పన్యాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…