Telangana

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని గెలిపించాలి_బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.

-హైదరాబాదులో ఆర్ కృష్ణయ్యను కలిసిన నీలం మధు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధును ఆర్ కృష్ణయ్య సాదరంగా స్వాగతించి అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి, తనకు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్యను నీలంమధు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదు అన్నారు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావడం హర్ష నియమన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 64శాతం బిసిల ఓట్లు ఉన్నాయని, ఏదైనా పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వాలంటే భయపడతాయన్నారు. అలాంటిది బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యువనేత నీలంమధును గుర్తించిన కాంగ్రెస్ ఆధినాయక్తవానికి అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎంపీ ఎన్నికల్లో నీలంమధును గెలిపించుకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీసీ కులాలు, ఇతర అన్ని కులాల మద్దతుదారులు సానుభూతిపరులు ఐక్యమై మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని పార్లమెంటుకు పంపించాలని కోరారు. మధును పార్లమెంటుకు పంపితే ఆయన మద్దతు తీసుకొని దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం పోరాడుతామని   ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘం నాయకులు సుధాకర్, నంద గోపాల్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ, తదితరులు నీలం మధును శాలువాలతో సన్మానించి, సంఘీభావం తెలిపారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago