హైదరాబాద్
పరిస్థితులు అనుకూలించని కారణంగా ఏడు నెలలకే చిన్నారి జన్మించింది. కానీ విధి ఆ పాపకు కఠోర పరీక్ష పెట్టింది. సరైన మోతాదులో మెదడు అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఏడురోజుల ఆ చిన్నారి హైదరాబాద్ మదీనాగూడ లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇదే పరిస్థితిలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇరువురు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి పిల్లలను రక్షించుకునేందుకు ఆ కుటుంబం యావత్ దారబోస్తుంది. వీరి చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారికున్న ఆస్తి అమ్ముకుని ఖర్చు పెట్టారు. . ఆసుపత్రి బిల్లులు కట్టడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు.
బీహెచ్ఈఎల్ ఎమ్ఐజి లో నివాసముండే ఆ కుటుంబం పేదరికం వల్ల చిన్నారి ప్రాణహాని పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ప్రణీత ఎలాగైనా తన కూతురును కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉండే రామచంద్రపురం ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది అనురాధ ఈ విషయాన్ని ఎండిఆర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు . దేవేందర్ రాజు సహృదయంతో వెంటనే స్పందించి . మంగళవారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేదలకు ఎల్లవేళలా అండగా నిలబడుతున్న ఈ ఫౌండేషన్ ప్రతినిధులను అందరూ ప్రశంసిస్తున్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…