హైదరాబాద్
పరిస్థితులు అనుకూలించని కారణంగా ఏడు నెలలకే చిన్నారి జన్మించింది. కానీ విధి ఆ పాపకు కఠోర పరీక్ష పెట్టింది. సరైన మోతాదులో మెదడు అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఏడురోజుల ఆ చిన్నారి హైదరాబాద్ మదీనాగూడ లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇదే పరిస్థితిలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇరువురు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి పిల్లలను రక్షించుకునేందుకు ఆ కుటుంబం యావత్ దారబోస్తుంది. వీరి చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారికున్న ఆస్తి అమ్ముకుని ఖర్చు పెట్టారు. . ఆసుపత్రి బిల్లులు కట్టడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు.
బీహెచ్ఈఎల్ ఎమ్ఐజి లో నివాసముండే ఆ కుటుంబం పేదరికం వల్ల చిన్నారి ప్రాణహాని పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ప్రణీత ఎలాగైనా తన కూతురును కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉండే రామచంద్రపురం ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది అనురాధ ఈ విషయాన్ని ఎండిఆర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు . దేవేందర్ రాజు సహృదయంతో వెంటనే స్పందించి . మంగళవారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేదలకు ఎల్లవేళలా అండగా నిలబడుతున్న ఈ ఫౌండేషన్ ప్రతినిధులను అందరూ ప్రశంసిస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…