_ప్రతి మనిషిలో ఉత్తేజాన్ని నింపే శక్తి జానపదం..
–జానపద కళలు ప్రజల గుండె చప్పుడు
అమ్మ లాలి పాట బిడ్డ ఆకలిని మరిపించడంలో జోల పాట చక్కటి నిద్రనందించే శక్తి జానపద పాటకుంది. మాట నుండి పాట ఉద్భవిస్తే అదే జానపదం. అటువంటి జానపద కళాసంపదను ప్రతి ఒక్కరం కాపాడుకోవాలని పటాన్చెరు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు గారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మా ఊరి జానపదం వారు నిర్మించిన మనిషి జీవన విధానం అనే జానపద పాట సిడీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం యూ ట్యూబ్ ప్రసార మాద్యమంలో పాటను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ ప్రతి మనిషిలో ఉత్తేజ శక్తిని నింపే మహా శక్తి జానపద కళకు ఉందని అటువంటి జాన పద కళలు మన తెలంగాణ ప్రజల గుండె చప్పుడని అన్నారు. జానపద కళా సంపదను కాపాడే విధంగా రానున్న తరాలు గుర్తుంచుకే విధంగా పాటలను విడుదల చేస్తున్నందుకు మన ఊరు జానపదం టీంను అభినందించారు. అంతే కాకుండా ఈ పాటను చిత్రీకరించడానికి సూచనలు సలహాలు చేసిన రాఘవరెడ్డి టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మన ఊరి జానపదం ప్రొడ్యూసర్ కుమార్, అజయ్, దర్శకుడు మహావీర్ ఆరుద్ర, కెమెరామెన్ వినయ్ కుమార్ మన్నే, ఎండిఆర్ మధు, ప్రణీత్, వినయ్ గౌడ్, మీడియా సోదరులు నరేష్, నర్సింమ, చారి, శివ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…